ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 13ప్రజాపాలన ప్రతినిధి **పిగిలిపూర్ లో ప్రశాంతన్నకు ఘన స్వాగతం పలికి
Published: Tuesday March 14, 2023
ప్రగతి నివేదన యాత్రలో భాగంగా 50వ రోజు సాయంత్రం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని పిగిలిపూర్ గ్రామానికి చేరుకున్న యువనేత శ్రీ మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి గారికి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు.గ్రామంలో గడపగడపకు తిరిగి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గుర్తు చేశారు.కావలసిన అభివృద్ధిని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
గ్రామ చౌరస్తాలో నిర్వహించిన సమావేశంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ...ప్రగతి నివేదన యాత్రతో ఇప్పటి వరకు 50రోజులు, 85గ్రామాలు, 650కిలోమీటర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నామని అన్నారు.గ్రామంలో అంగన్వాడీ భవన నిర్మాణం కోసం 5లక్షల రూపాయలు, 40వీధి దీపాలు ఎమ్మెల్యే శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి సహకారంతో బంటీ మంజూరు చేశారు.ఎమ్మెల్యే సాయినగర్ రోడ్డును మంజూరు చేసినట్టు బంటీ తెలియజేశారు.
Share this on your social network: