ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి

Published: Thursday August 04, 2022

 ఆగస్టు 03:ఎక్స్ప్రెస్ మార్కెటింగ్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బజాజ్ బైక్ షోరూం ను మున్సిపల్ చైర్మన్ ఆర్. జగదీశ్వర్రెడ్డి ప్రారంభించారు. కొడంగల్ పట్టణంలోని తాండూరు రోడ్డులో గల వైష్ణవి కాంప్లెక్స్లో బుధవారం బజాజ్ పల్సర్ ద్విచక్ర వాహన షోరూంను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. యువకులు స్వయం ఉపాధి గా వాహన షోరూంను ప్రారంభించడం హర్షణీయమన్నారు. కార్యక్రమం లో

మున్సిపల్ కమిషనర్ నాగరాజు, బిజెపి నాయకులు పున్నం చంద్ లాహోటి, కే. చంద్రప్ప, మోహన్రావు, కృష్ణయ్య, లక్ష్మణ్, శేఖర్, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు దస్తప్ప జగన్ వెంకటేశం మాఫీ వెంకట్, తదితరులు పాల్గొన్నారు.