ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వలేదని సెల్ టవర్ ఎక్కిన యువకుడు

Published: Friday February 26, 2021
మధిర ఫిబ్రవరి 25 ప్రజా ప్రతినిధి: జీలుగుమాడు కి చెందిన రమేష్ అనే వ్యక్తి వారి తండ్రి రైల్వే ఉద్యోగం చేస్తూ ఇటీవల మరణించారు. దానికి సంబంధించిన ఫ్యామిలీ సర్టిఫికెట్ రెవెన్యూ అధికారులు ఇవ్వడం లేదంటూ ఆరోపిస్తూ సెల్ టవర్ ఎక్కినట్లు వారి బంధువులు పేర్కొంటున్నారు. సెల్ టవర్ సంఘటనా స్థలానికి చేరుకున్న టౌన్ పోలీసులు.ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని వెంటనే కిందికి దిగి రావాలని ఫోన్ లో కోరిన పోలీసులు.సెల్ టవర్ ఘటనపై స్పందించిన తాసిల్దార్ సైదులు. తన తండ్రి మరణించిన ఫ్యామిలీ సర్టిఫికెట్ ఇవ్వడం లేదంటూ సెల్ టవర్ ఎక్కిన యువకుడు రమేష్ వార్త తెలుసుకున్న స్థానిక తాసిల్దార్ సైదులు ఈ విషయమై మాట్లాడుతూ రమేష్ తండ్రి శ్రీరామ రామారావు కి ఇద్దరు భార్యలున్నారు. ఇదే క్రమంలో మరో  మహిళ వచ్చి నేను రామారావు భార్య నే అంటూ నాకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కావాలని ఫిర్యాదు చేయడంతో వారిని పిలిచి మాట్లాడటం జరిగిందని. దీన్లోని మీ గ్రామానికి వచ్చి పూర్తి స్థాయిలో విచారణ జరిపించి అర్హులైన వారికి ఫ్యామిలీ మెంబర్స్ సర్టిఫికెట్ అందిస్తామని చెప్పటం జరిగిందని తాసిల్దార్ సైదులు పేర్కొన్నారు.