ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవం వేడుకలు

Published: Saturday January 28, 2023

కొడిమ్యాల, జనవరి 26 (ప్రజాపాలన  ప్రతినిధి): కొడిమ్యాల మండలంలోని నాచుపల్లి మరియు నవపేట్ గ్రామంలో  మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ పండుగ పతాక ఆవిష్కరణ కార్యక్రమానికి చేసిన ముఖ్య అతిథిగా సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగారావు విద్యార్థులకు జాతీయ పండుగ గురించి వివరించారు. ఆటల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఇట్టి బహుమతులు నాచుపల్లి గ్రామస్తులు చెన్నూరి గంగాధర్ ఎల్ఐసి ఏజెంట్  డొనేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీమతి అంబాటి లత తిరుమలేష్ ,ఉప సర్పంచ్ బొజ్జ నర్సయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముమ్మాడి హరికృష్ణ ప్రసాద్,లావణ్య, ఉపాధ్యాయులు మంజులత, పద్మావతి,ప్రజా ప్రతినిధులు మాజీ ఎంపీటీసీ శ్రీమతి విమల సురేష్ , డాక్టర్ అంజయ్య, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శేఖర్,కరోబార్ చారి, తల్లిదండ్రులు యువకులు మరియు వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం పిల్లలకు చేయడం జరిగినది.