యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులకు పర్వతారోహణ శిక్షణ

Published: Saturday February 25, 2023
* జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి  ఉపేందర్ 
వికారాబాద్ బ్యూరో 24 ఫిబ్రవరి ప్రజాపాలన : యాదాద్రి భువనగిరి జిల్లాలో విద్యార్థులకు పర్వతారోహణ శిక్షణ ఇప్పించనున్నామని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ఉపేందర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లాలోని కళాశాల వసతి గృహాలకు చెందిన 100 మంది విద్యార్థులను రెండు బస్సులలో పర్వతారోహణ శిక్షణ కొరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి ఖిల్లాకు తీసుకొని వెళ్లడం జరుగుతుందని  ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ అధికారితో పాటు  ముఖ్య అతిథిగా గిరిజన సంక్షేమ శాఖ అధికారి  కోటాజి  హాజరు కావటం జరిగింది. సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి భీమ్ రాజు వసతి గృహాల సంక్షేమ అధికారులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.