జిల్లా కార్యవర్గ సభ్యులుగా మేడి రాంబాబు..
Published: Tuesday October 25, 2022
తల్లాడ, అక్టోబర్ 23 (ప్రజాపాలన న్యూస్) :- తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కార్యవర్గ సభ్యులుగా తల్లాడ నినాదం న్యూస్ రిపోర్టర్ మేడి రాంబాబు నియమితులయ్యారు. ఖమ్మంలోని ఎస్సార్ కన్వెన్షన్ హాల్లో జరిగిన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మూడో మహాసభలో జిల్లా నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నూతన కమిటీలో జిల్లా కార్యవర్గ సభ్యులుగా రాంబాబు నియమితులయ్యారు.
Share this on your social network: