వ్యాక్షినేషన్ సెంటర్లును పరిశీలించిన - డిప్యూటీ సీఈవో సంధ్యారాణి

Published: Saturday April 24, 2021
సారంగాపూర్. ఏప్రిల్ 23 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండలంలోని జడ్పీ డిప్యూటీ సీఈవో అడిషనల్ పీడీ సంధ్యారాణి సారంగాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరియు రేచపల్లి గ్రామంలో వ్యాక్సిన్ సెంటర్లను పరిశీలించారు. పర్యవేక్షణలో ఆయా వ్యాక్సిన్ సెంటర్ల యందు త్రాగునీరు టెంట్స్ ఏర్పాట్లను పరిశీలించారు. సారంగాపూర్ సెంటర్ రద్దీగా ఉన్నందున గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు పోలీసుల సహకారంతో 45 సంవత్సరాలు నిండిన వారికి క్యూలైన్లు  ఏర్పాటు చేయుటకు ఆదేశించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పుల్లయ్య సారంగాపూర్ ఎంపీవో శశికుమార్ బీరపూర్ ఎంపీవో రాజు మండల్ పంచాయతీ వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.