మాటూరు పేట గ్రామపంచాయతీ అభివృద్ధిలో ప్రజల నుండి విశేష స్పందన

Published: Thursday October 06, 2022
మధిర రూరల్ అక్టోబర్ 5 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో మాటూరు పేట గ్రామం.అభివృద్ధితో గ్రామ రూపురేఖలు మార్పుమూడున్నర సంవత్సరాల పరిపాలనలో గ్రామ అభివృద్ధిలో  తనదైన ముద్ర వేసుకున్న సర్పంచ్.అనతి కాలంలోనే గ్రామ ప్రజల మనసును చురుగున్న సర్పంచ్ రావూరి శివనాగ కుమారి.తెలంగాణ ప్రభుత్వం తోడ్పాటుతో గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న తపన ఆ సర్పంచ్ సొంతం.ఆ తపనే గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తుంది.ఈ అభివృద్ధిలో మాటూరుపేట గ్రామ ప్రజలు కీలకపాత్ర వహిస్తున్నారు అంటున్నారు సర్పంచ్.మూడున్నర ఏళ్లలోనే ఎన్నో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగిందని,గ్రామంలో దాదాపుగా 40 లక్షల రూపాయలతో సిసి రోడ్ల నిర్మాణం,మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీటి కుళాయి ఏర్పాటు,తడి చెత్త,పొడి చెత్తను పంచాయతీ తరపున ఎనిమిది లక్షలతో కొనుగోలు చేసిన ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్కు తరలింపు, లక్షన్నర రూపాయలతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు,మనఊరు- మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.గ్రామంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛనులతో కలిపి 350 పింఛన్లు గ్రామంలో పంపిణీ చేస్తున్నట్లు,ఎస్సీ స్లాబ్ ప్లాన్ నిధులతో కాలనీలో సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పలు కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి,ఆ కుటుంబాలకు ఆర్థిక చేయూత అందించమన్నారు. రైతుబంధు,రైతుబీమా ద్వారా రైతులందరూ లబ్ధి పొందుతున్నారు అన్నారు.హరితహారంలో భాగంగా గ్రామంలో 2000 మొక్కల నాటామన్నారు.ప్రతి మొక్కకు ట్రీ గాడు ఏర్పాటు చేసి వాటి సంరక్షణ బాధ్యతలు గ్రామపంచాయతీ తీసుకుంటుంది.రెండు గ్రామాల మధ్య ఉన్న చెరువు కట్టపై పల్లె ప్రకృతి వనం నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని గ్రామ ప్రజలకు కల్పించాం. ప్రతి మంగళ,శుక్రవారం పారిశుద్ధ్యంలో భాగంగా అధికారులతో కలిసి డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నాయి.ఇల్లు లేని నిస్సహాయకులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు పంపిణీ కార్యక్రమం చేపట్టాము.గ్రామంలో దహన సంస్కారాలకు ఇబ్బంది లేకుండా పది లక్ష రూపాయలు వెచ్చించి వైకుంఠధామ నిర్మాణం చేపట్టడం జరిగింది.అభివృద్ధి పనులకు సహకరించిన గ్రామపంచాయతీ పాలకవర్గానికి,ప్రజలకు ప్రత్యేక ధన్యవాదములు తెలియజేశారు సర్పంచ్ గ్రామం ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన