విద్యార్థి ఉద్యమాలకు దిక్చూచి AISF : మడిపల్లి లక్ష్మణ్

Published: Friday August 13, 2021
మధిర, ఆగస్టు 12, ప్రజాపాలన ప్రతినిధి : విద్యార్థుల పోరాట కేతనం AISF ఆవిర్భావ స్ఫూర్తితో విద్యార్థిలోకం ఉద్యమించాలి అఖిల భారత విద్యార్థి సమాఖ్య AISF 86వ ఆవిర్భావ దినోత్సవంఈ సందర్భంగా మధిర ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదుట జండా ఆవిష్కరణ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మడుపల్లి లక్ష్మణ్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ: స్వాతంత్య్రం రాకపూర్వం మొదటి విద్యార్థి సంఘంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో మహానగరంలో భగత్ సింగ్, రాజ్ గుర్, సుఖ్ దేవ్, ఆజాద్ ల ఇంకా ఎందరో వీరుల ఆశయ సాధన కోసం బబృద్దీన్ బాసు, ప్రేమ్ నారాయణ భార్గవ్ ల నాయకత్వాన 1936 ఆగస్టు 12న AISF ఆవిర్భవించింది. బ్రిటిష్‌ సామ్రాజ్యవాదుల బానిసచేర నుంచి మాతృభూమి విముక్తి కై సాగిన వీరోచిత స్వాతంత్ర్య ఉద్యమంలో పొత్తిళ్లలోనే పిడికిళ్లు బిగించి స్వాతంత్ర్యము మా జన్మ హక్కు అని మా అంతం చూసిన - స్వాతంత్ర్యోద్యమ పంతం వీడం అంటూ నినదించి భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని, భరతమాత బానిస సంకెళ్ల నుంచి విముక్తి కావాలని ఎందరో విద్యార్థుల విప్లవకిషోరుల బలిదానం చేసిన ఘనమైన చరిత్ర కలిగిన దేశములోనే ఏకైక విద్యార్ధి సంఘం AISF. పోరాటాలు, త్యాగాలే ధ్యేయంగా ఏర్పాటైన ఈ విద్యార్థి సంఘం స్వాతంత్య్రనంతరం ప్రభుత్వ విద్య పరిరక్షణకై, శాస్త్రీయ, కామన్ విద్యావిధానం అమలుపై నిరంతరం పోరాటాలు సాగిస్తూ 85 సంవత్సరములుగా విద్యార్ధుల శ్రేయస్సు కోసం అశేష త్యాగాలు చేస్తూ ఆవిర్భావం నాటి నుంచి నేటివరకు గల్లి నుండి డిల్లీ వరకు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా - పోరాటాలే ప్రాణంగా - విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగాచదువుతూ పోరాడుతాం - చదువుకై పోరాడుతాం అంటూ తెలంగాణ రైతాంగ పోరాటంలో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని వీరోచిత పోరాటం, 18 సంవత్సరములకు ఓటుహక్కు ఉద్యమం మలిదశ తెలంగాణ పోరాటంలోహాస్టళ్ల సమస్యలపైవిద్య వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న పాలకులపై అలుపెరుగని సమరశీల పోరాటాలు చేసి దేశంలో ఎన్నో విజయాలు సాధించింది AISF ఈ కార్యక్రమంలో AISF మధిర మండల పట్టణ కార్యదర్శులు కొంగర నరేంద్ర అన్నవరపు అయ్యప్ప సాయి మణికంఠ తదితరులు పాల్గొన్నారు.