వేటగాళ్ల ఉచ్చులో పడి రైతు మృతి

Published: Friday March 19, 2021

మంచిర్యాల జిల్లా, మార్చి18, ప్రజాపాలన ప్రతినిధి : మంచిర్యాల జిల్లా కన్నెపల్లి మండలం దాంపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామ సమీపంలోని పొలాల్లో అటవీ జంతువుల కోసం వేటగాళ్లు వేసిన ఉచ్చుకు రైతు బలయ్యాడు. బుధవారం రాత్రి గ్రామానికి చెందిన రైతులు మేకల శంకర్, నారాయణ ఇద్దరూ కలిసి కట్టెలు అమ్మడానికి ఎడ్లబండిలో విగామ్ గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో వారు దారి తప్పారు. ఎడ్ల బండి దిగి దారి వెతుకుతుండగా పత్తి చేను వద్ద బిగించిన ఉచ్చుకు శంకర్ తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే తేరుకున్న నారాయణ గ్రామానికి వెళ్లి సమాచారం అందించాడు. తాండూరు సీఐ బాబూరావు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఉచ్చు బిగించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.