గుల్మొహర్ పార్క్ స్మశాన వాటిక నిర్మించాలని కోరుతూ వినతిపత్రం

Published: Wednesday July 28, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధి, గచ్చిబౌలి డివిజన్ గుల్మొహర్ పార్క్ అధ్యక్షులు షేక్ ఖాసిమ్, నేతాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ కాలనీ అధ్యక్షులు భేరీ రామచందర్ యాదవ్ ఆధ్వర్యంలో తమ కే. శ్రీనివాసులు అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే అన్డ్ ల్యాండ్ రికార్డ్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ స్టేట్ నల్లగండ్ల చెరువు పక్కన ఉన్న అతి పురాతన స్మశాన వాటికకు స్థలం సర్వే చేసి ఇవ్వగలరు అని కోరుతూ వినతిపత్రం అందించారు. గతంలో కూడా జిహెచ్ఎంసి ఉప కమిషనర్ వెంకన్నకి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని  స్మశాన వాటిక అభివృద్ధి చేయాలని ప్రహరీ గోడ నిర్మించాలని మంచినీటి సౌకర్యం కల్పించాలని నేతాజీ నగర్ కాలనీ నల్లగండ్ల గ్రామము శ్రీ క్రిష్ణ కాలనీ డాక్టర్ కాలనీ గుల్మహర్  పార్క్ కాలనీ  కాలనీలలో ఎవరు స్వర్గస్తులైన వారిని ఈ స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుపుతారు కాబట్టి స్మశాన వాటిక ఏర్పాటు చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి, ఉపాధ్యక్షులు లక్ష్మణరావు, శేఖర్ రావు, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ యాదవ్, బాల్రాజీ, సాగర్, శివ, తదితరులు పాల్గొన్నారు.