మత్స్య గిరింద్రస్వామిని దర్శించుకున్న పొన్నం ప్రభాకర్

Published: Monday January 02, 2023
శంకరపట్నం జనవరి 01ప్రజాపాలన రిపోర్టర్:

శంకరపట్నం మండల కొత్తగట్టు గ్రామం లోని శ్రీ మత్స్య గిరింద్ర స్వామిని ఆదివారము కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ఆయన వెంట కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, టి పి సి సి సబ్యుడు బత్తిని శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆంగ్ల నూతన సంవత్సరం సందర్బంగా రాష్ట్రము లోనే ఏకైక దేవస్థానమైన మత్స్య గిరింద్ర స్వామి కొత్తగట్టులో కొలువై ఉండడం మన అద్రుష్టమని,స్వామిని దర్శించుకోవడం సంతోషంగా ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు తధితరులు పాల్గొన్నారు.