ఇబ్రహీంపట్నం నవంబర్ తేదీ 7ప్రజాపాలన ప్రతినిధి *అస్మాత్ పూర్ గ్రామంలో సదర్ ఉత్సవాలు ఘనంగా ని
Published: Tuesday November 08, 2022
మంచాల మండలం అస్మాత్ పూర్ గ్రామంలో మల్లికార్జున యాదవ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదర్ సయ్యాట కార్యక్రమంలో అఖిల భారత యాదవ సంఘము రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బర్ల జగదీశ్ యాదవ్ పాల్గొని కార్యాక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు, యాదవులు అన్ని కులాలను కలుపుకుంటూ రాజకీయాల్లో ఎదగాలని మనది గోవులను పూజించే జాతి కాబట్టి సంవత్సరానికి ఒకసారి సదర్ కార్యక్రమం నిర్ణయించుకొని మన ఐక్యతను చాటి చెప్తామాన్ని తెలిపారు. ఈ సదరు కార్యక్రమంలో అస్మాత్ పూర్ సర్పంచ్ హరిప్రసాద్, అఖిల భారత యాదవ సంఘము నాయకులు ఎల్గపల్లి శ్రీరామ్ యాదవ్, దాయి నవీన్ యాదవ్, దాయి తరుణ్ తేజ్ యాదవ్, గ్రామ యాదవ సంఘము నాయకులు నార్ల శ్రీశైలం యాదవ్, మంథని రాజు యాదవ్, ఐలయ్య యాదవ్, లింగస్వామి యాదవ్, తిరుమలేశు యాదవ్, యాదవ సంఘము నాయకులు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: