ఎస్ ఐ ని సన్మానించిన స్థానిక నాయకులు శంకరపట్నం నవంబరు 08ప్రజాపాలన ప్రతినిధి:

Published: Thursday November 10, 2022
శంకరపట్నం మండల కేంద్రం లో ని స్థానిక ఎస్ ఐ -ఆపదలో ఉన్నార అందుబాటులో తాను ,తన పోలీసు శాఖ ఏని టైం ఉన్నామని నిరూపించారు శంకరపట్నం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ కె చంద్రశేఖర్ నిరూపించారు.సోమవారం సాయంత్రం బ్రతుకుదెరువు కోసం ఉత్తరప్రదేశ్ నుండి హుజురాబాద్ పట్టణంలో కూలి పని చేసుకుని జీవన ఉపాధి పొందుతున్న  ఫజారత్ హైమాద్ అనే వ్యక్తి శంకరపట్నం మండలం గొల్లపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగి  పోయి కిందపడి ఉండడంతో ప్రమాద సమాచారం తెలుసుకున్న ఎస్ఐ గారు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడ్డ వ్యక్తి ని  వరంగల్ ఎంజీఎం కు  తరలించి విరిగిన కాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ పడిందో గమనించి దాన్ని సత్వర శస్త్ర చికిత్స నిమిత్తం పోలీస్ సిబ్బంది సహకారంతో ఎంజిఎం ఆసుపత్రి వరంగల్ కు తరలించిన గొప్ప మనసు గల మహనీయుడు ఎస్ ఐ  చంద్రశేఖర్  మండలంలో ఎప్పుడు ఎలాంటి ఆపదలు, ఎలాంటి సమస్యలు ఎదురైనా చట్ట పరిధిలో పరిష్కరిస్తూ ప్రజల, ప్రజా ప్రతినిధుల, పోలీస్ శాఖ అధికారుల మన్ననలు పొందుతున్న చంద్రశేఖర రావు పనితీరు పట్ల తనకున్న అభిమానంతో ఈరోజు శంకరపట్నం పోలీస్ స్టేషన్లో శాలువాతో ఘనంగా సన్మానించి నా స్థానిక నాయకుడు గుర్రం శ్రీకాంత్ గౌడ్. పోలీస్ శాఖలో మరెన్నో తనదైన శైలిలో  నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి మరెందరో ఆదరభిమానాలు పొంది, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అయన అన్నారు
. ఈ కార్యక్రమంలో రైస్ మిల్ల ర్స్  నాయకులు తనకు ఓంకారం, తనకు ప్రభాకర్, వంగ సత్యనారాయణ, సూరారం  కృష్ణ, గుర్రం బుచ్చయ్య, కొమురయ్య, కీసర సంపత్, తుమ్మ సుధాకర్ ,ఇర్షాద్ ,బోంగోని శ్రీనివాస్ తదితరులు ఉన్నారు