ఎంపీపీ కొండబాల చేతుల మీదుగాసీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

Published: Thursday February 17, 2022
మధిర ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి మరి మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు స్థానిక టిఆర్ఎస్ కార్యాలయంలో ఈరోజు మహాదేవపురం గ్రామానికి చెందిన కోటేశ్వరావుకి రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎంపీపీ మెందేం లలిత 16 వేల రూపాయలు విలువచేసే చెక్కును బాధితునికి అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలిచే ప్రభుత్వం అని తెలంగాణ ప్రభుత్వం పేదవారికి అండగా ఉంటుందన్నారు అదే కాకుండా దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని సంక్షేమ ఫలాలు ఆయా రాష్ట్రాల్లో అందిస్తున్నాయని ఆమె తెలిపారు అన్ని వర్గాల ప్రజలను రైతులు ఆదుకుంటూ అభివృద్ధి బాటలో ప్రభుత్వం ఉందని ఆమె తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో మందికి మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, ఎండీ ఖాదర్, మేందెం వెంకన్న పాల్గొన్నారు.