మహా శివరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రాల స్థాయి ఎద్దుల పోటీలు

Published: Saturday March 13, 2021
మధిర, మార్చి 12, ప్రజాపాలన ప్రతినిధి : మహా శివరాత్రి ఉత్సవాల్లో రెండు రాష్ట్రాల స్థాయి ఎద్దుల పోటీలు ప్రారంభిస్తున్న మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, మృత్యుంజయ స్వామి ఆలయ చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు, పోటీల నిర్వాహకులు వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పర్సా శ్రీనివాసరావు, రంగిశెట్టి కోటేశ్వరరావు, రామారావు, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్తూర్ నాగేశ్వర మాట్లాడుతూ రైతులకు ఆహ్లాదకరంగా ఉండేవిధంగా ఈ పోటీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.