ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 3,362 నూతన రేషన్ కార్డులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్

Published: Friday July 30, 2021
ఇబ్రహీంపట్నం, జులై 29 ప్రజాపాలన ప్రతినిధి : యాచారం మండల కేంద్రంలోని సాయిశరణం ఫంక్షన్ హాల్లో జరిగిన నూతన రేషన్ కార్డుల మరియు కళ్యాణలక్ష్మీ-షాదీముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై 593 మంది లబ్దిదారులకు రేషన్ కార్డులు మరియు 73 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ-షాదీముబారక్ చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా 3,362 మంది లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు అందచేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య, జడ్పీటీసీ చినొలజంగమ్మ, సహకార సంఘo చైర్మన్ రాజేందర్ రెడ్డి, వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ యాదయ్య, తహసీల్దార్ నాగయ్య, తెరాస మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బాషా మండలంలోని గ్రామాల సర్పంచ్లు, ఎంపిటిసిలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.