బహిరంగ సభను విజయవంతం చేయండి శంకరపట్నం ఫిబ్రవరి 8 ప్రజాపాలన రిపోర్టర్

Published: Thursday March 09, 2023

శంకరపట్నం మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గోపగోని బస్వయ్య ఆధ్వర్యంలో పార్టీ ముఖ్య కార్యకర్తల  సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ముఖ్య అతిదిగా ఈ నెల 9న కరీంనగర్ లో జరిగే రేవంత్ రెడ్డి బహిరంగ సభకు మానకొండూరు నియోజకవర్గం ఇంచార్జ్ చిలుక మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఏనుమల రేవంత్ రెడ్డి  చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్ర విజయవంతం కాగా గురువారము జరగబోయే సభకు  శంకరపట్నం మండలం నుండి  2,500 మందితో  ప్రజలు బహిరంగ సభలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల ముఖ్య నాయకులు వివిధ గ్రామాల  అధ్యక్షులు పాల్గొన్నారు.