యువజన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండవ సారీ మంకాల కర్ణాకర్ కు నియామకపత్రాన్ని అందజేసిన

Published: Monday July 11, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 10 ప్రజాపాలన ప్రతినిధి.ఇబ్రహీంపట్నం మండలం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాయపోల్  గ్రామానికి చెందిన మంకాల కరుణాకర్ ను  రెండవసారి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు కొత్త కాపు శివసేనరెడ్డి ఆమోదించగా ఆయోక్క నియామక పత్రాన్ని మాజీ ఎమ్మెల్యే  మల్ రెడ్డి రంగారెడ్డి,  జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ ఇబ్రహీంపట్నం జడ్పీటీసీ భూపతిగళ్ళ మహిపాల్, కాంగ్రెస్ రాష్ట్ర యువ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి  చేతుల మీదగా ఆదివారం మంకాల కరుణాకర్ కు నియామక పత్రం అందించడం జరిగింది. ఈ సందర్భంగా మంకాల కరుణాకర్ మాట్లాడుతూ  ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో యువజన కాంగ్రెస్ ని మరింత బలోపేతం చేస్తానని, వచ్చే శాసనసభ ఎన్నికలలో మల్ రెడ్డి రంగారెడ్డిని మెజారిటీతో గెలుపుకోసం ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. త్వరలోనే పూర్తి స్థాయిలో మండల కమిటీ వేస్తామని అన్నారు. తన మీద నమ్మకంతో రెండవ సారి యువజన కాంగ్రెస్ మండల అధ్యక్ష పదవి సహకరించిన కాంగ్రెస్ నాయకులందరికీ  పేరుపేరునా ధన్యవాదాలు తెలియ చేశారు. ఈకార్యక్రమంలో కంబాలపల్లి గురునాథ్ రెడ్డి, కాంగ్రెస్ అధికార పార్టీ ప్రతినిధి కొండ్రు ప్రవీణ్, సోషల్ మీడియా జిల్లా ఇన్చార్జ్ పూలమోని రామకృష్ణ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జడల రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.