కలకొడిమలో పలు కుటుంబాలను పరామర్శించిన జడ్పీటీసీ దిరిశాల ప్రమీల దంపతులు..
Published: Tuesday January 25, 2022
తల్లాడ, జనవరి 24 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని కలకొడిమ గ్రామంలో తల్లాడ జడ్పీటీసీ సభ్యురాలు దిరిశాల ప్రమీల, దాసురావు దంపతులు తమ స్వగ్రామంలో పలు కుటుంబాలను సోమవారం పరామర్శించారు. గ్రామానికి చెందిన ఏర్పుల సామేలు మరణించడంతో ఆయన మృతదేహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వడ్డే నరసింహారావు దశదిన కార్యక్రమానికి హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఇరువురు కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించారు. నివాళులు అర్పించిన వారిలో ఎంపీటీసీ ఆదూరి వెంకటేశ్వర్లు, తెరాస గ్రామ అధ్యక్షుడు మోహన్ రావు, వడ్డే తులిశమ్మ తదితరులు ఉన్నారు.
Share this on your social network: