చేగొమ్మ పి ఎ సి ఎస్ వారు 599 మంది రైతులకు గాను 4 కోట్లు ల రుణాల పంపిణీ..

Published: Thursday April 29, 2021
పాలేరు, ఏప్రిల్ 28, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా:- కూసుమంచి మండలం చేగొమ్మ. ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం లిమిటెడ్ చేగొమ్మ వారు 599 మంది రైతులకు గాను 4 కోట్లు ల రుణాలను ఈ రోజు ఉదయం పిఎసిఎస్ చైర్మన్ & డీసీసీబీ డైరెక్టర్ ఐన ఇంటూరి శేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీ కందాల ఉపేందర్ రెడ్డి, మరియు డి సి సి బి చైర్మన్ కురాకుల నాగభూషణం, డి సి సి బి సీఈవో వీరబాబు, చేతులు మీదగా చేగొమ్మ రైతు వేదిక నందు చెక్కుల ద్వారా రుణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నాకు జడ్పీటీసీ ఇంటూరి బేబీ, ఎంపీపీ బాణోత్ శ్రీనివాస్, నేలకొండపల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షులు సెట్రమ్ నాయక్, మద్దెలపల్లి మార్కెట్ కమిటీ అధ్యక్షులు మళ్లీడి అరుణ, వెంకన్న, చేగొమ్మ సర్పంచ్ రెడ్డిమళ్ల రమణమ్మ, జీళ్ళచేరువు సర్పంచ్ కొండ సత్యం, ఎంపీటీసీ లు ఉడుగు జ్వోతి, అంబాల ఉమ శ్రీనివాస్, కూసుమంచి సొసైటీ చైర్మన్ వాసంశెట్టి వెంకటేశ్వర్లు, శ్రీవెంకటేశ్వర దేవస్థానం చైర్మన్ బొడ్డు నరేందర్, సొసైటీ డైరెక్టర్లు మరియు సంఘ సభ్యులు గ్రామాల రైతులు తదితరులు పాల్గొన్నారు.