షటిల్ టోర్నమెంట్ కి అతిథిగా రావాలని రేగాకు ఆహ్వాన పత్రిక అందజేసిన సారపాక యూత్

Published: Thursday December 08, 2022
బూర్గంపాడు (ప్రజా పాలన.).
భద్రాద్రి కొత్తగూడెం, జిల్లా  బూర్గంపాడు మండలం సార పాక గ్రామంలో బ్రిలియంట్ స్కూల్ ఆవరణలో ఈ నెల 9 వ తేదీన జరిగే ష టిల్ టోర్నమెంట్ కు ప్రారంభోత్సవానికి భద్రాద్రి కొత్త గూడెం జిల్లా అధ్యక్షులు మన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగ కాంతా రావు  వచ్చి రిబ్బన్ కటింగ్ చేసి ఈ టోర్నమెంట్ ను ప్రారంభించాలని ఆహ్వాన పత్రం సమర్పించిన సార పాక యూత్ మరియు  పిఎసిఎస్  చైర్ మెన్ బిక్కసాని శ్రీను మైనారిటీ మండల ప్రధాన కార్య దర్శి గుల్ మొహమ్మద్ మండల యూత్ ఉపాధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్, శివ మోహన్ తదితరులు ఆహ్వానించడం జరిగింది,ఈ పోటీలో ఆసక్తి కలిగిన క్రీడాకారులు అందరూ పాల్గొని తమ పేర్లను నమోదు చేసుకొని ఎంట్రీ స్లిప్ తీసుకో గలరని మనవి,ఇందులో మొదటి ప్రైజ్ మనీ 10000/- లు మరియు రెండవ ప్రైజ్ మనీ 5000/- గా నిర్ణయించడం జరిగింది. క్రీడా కారులు తమ టాలెంట్ ను చూపించుకుని గెలుచుకోవడం జరుగుతుంది ఈ టోర్నమెంట్ ది 9-12-22 నుండి 11-12-22- వరకు జరుగుతుంది.