దంపతుల ను మింగిన కరోనా

Published: Monday April 26, 2021

బెల్లంపల్లి, మార్చి 25, ప్రజా పాలన ప్రతినిధి : ఉన్నత విద్యావంతులైన దంపతులు కరోనాతో మృతిచెందడం బెల్లంపల్లిలో పట్టణంలో తీవ్ర కలవరం రేపుతోంది. బెల్లంపల్లి పట్టణం లోని స్టేషన్ రోడ్డు కాలనీకి చెందిన ప్రధానోపా ధ్యాయులు సిరికొండ రమాదేవి ఈ నెల 17న కరోనా తో మృతి చెందగా ఆమె బర్త సిరికొండ ఆంజనేయ రావు కరోనా తో ఆదివారం మృతి చెందారు. దింతో బెల్లంపల్లి పట్టణంలో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదీలా ఉండగా ఒకే కుటుంబానికి చెందిన బార్య బర్తలు ఇద్దరు కరోనా తో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర మానసిక వేదన తో ఉండడం దానికి తోడు ఆమె భర్త సిరికొండ ఆంజనేయ రావు ఆదివారం ఉదయం కరోనాతో మృతి చెందడం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది