బహుజనులకు రాజ్యాధికారం దక్కాలి

Published: Friday December 16, 2022
* బహుజన్ వ్యాలంటరీ ఫోర్స్ బివిఎఫ్ రాష్త్ర కో-కన్వీనర్ బాబు నాయక్
వికారాబాద్ బ్యూరో 15 డిసెంబర్ ప్రజాపాలన : సమాజంలో అధిక శాతం ఉన్న బహుజనులకు రాజ్యాధికారం దక్కేలా పోరాడాలని బహుజన వాలంటరీ ఫోర్స్ రాష్త్ర కో-కన్వీనర్ బాబు నాయక్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డా„ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు వంద రోజుల యాత్ర వికారాబాద్ కు చేరుకున్న సందర్బంగా బివిఎఫ్ రాష్ట్ర కో - కన్వీనర్ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జి.క్రాంతి కుమార్ స్వాగతం పలికారు. బహుజనులు అన్ని రంగాల్లో ముందంజలో ఉండేలా ఐక్యమత్యంగా కృషి చేయాలన్నారు. బివిఎఫ్ వికారాబాద్ మండల్ కన్వీనర్ రాకేష్, కో - కన్వీనర్ అంతయ్య, మర్పల్లి మండల్ కన్వీనర్ బి. ప్రకాష్, మోమిన్పేట్ మండల్ కన్వినర్ బీ. శ్రీకాంత్, కోటపల్లి మండల్ కన్వినర్ ప్రశాంత్ ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జి. క్రాంతి కుమార్, అసెంబ్లీ ఇంచార్జ్ పెద్ది అంజయ్య, నియోజకవర్గ అధ్యక్షులు తలారి రాజు, నియోజకవర్గ ఉపాధ్యక్షులు ఇంటివెనుక అరుణ్, వికారాబాద్ మండల్ అధ్యక్షులు యాదయ్య, కోటపల్లి జనరల్ సెక్రటరీ సంతు, మర్పల్లి మండల్ నాయకులు శ్రీకాంత్, సోషల్ మీడియా కన్వీనర్ గణేష్, విజయ్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.