అక్టోబర్ 2 న జరిగే విద్యార్థి నిరుద్యోగ సైరన్ ను జయప్రదంచేయండి : వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి
Published: Saturday October 02, 2021
ఎర్రుపాలెం ప్రజాపాలన ప్రతినిధి ఒకటో తేదీ అక్టోబర్ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం జరిగినది ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ లీడర్ శ్రీ మల్లు భట్టి విక్రమార్క తలపెట్టిన అక్టోబర్ 2న హైదరాబాదులో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం. దిల్ శుక్ నగర్ రాజీవ్ చౌక్ నుండి ఎల్బీనగర్ శ్రీకాంతాచారి చౌరస్తా వరకు పాదయాత్ర కలదు, అనంతరం విద్యార్థి నిరుద్యోగ సమస్యలపైన సభ కార్యక్రమం కలదు అని వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మరియు తెలంగాణ రాష్ట్ర సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పాల్గొనడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి మధిర నియోజకవర్గం నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సమావేశంలో ఎర్రుపాలెం మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బండానరసింహరావు, INTUC అధ్యక్షుడు శీలం నర్సిరెడ్డి, సొసైటీ ఉపాధ్యక్షుడు కడియం శ్రీనివాసరావు, మధిర నియెజకవర్గం యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దేవరకొండ రాజీవ్ గాంధీ, SC సెల్ అధ్యక్షులు దేవరకొండ శ్రీనివాసరావు, గాంధీ పదం రావూరి నాగబాబు తదితరులు పాల్గొనడం జరిగింది.
Share this on your social network: