పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కష్టపడి పని చేయాలి
Published: Tuesday May 31, 2022
బిజెపి నాయకులు ఆరు ముళ్ళ పోషం, మున్నా రాజ్ సిసోడియా
బెల్లంపల్లి మే 30 ప్రజా పాలన ప్రతినిధి: రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీని పట్టణంలోని గడపగడపకు తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి, ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని బిజెపి బెల్లంపల్లి పట్టణ ఇంచార్జ్ మున్నరాజ్ సిసోడియా, సీనియర్ నాయకులు ఆరు ముళ్ళ పోశం అన్నారు.
ఆదివారం సాయంత్రం బిజెపి బెల్లంపల్లి పట్టణ కార్యవర్గ సమావేశం పట్టణ అధ్యక్షుడు కోడి రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు, వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే ధ్యేయంగా, ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ఇప్పటి నుండే పార్టీ కార్యక్రమాలను, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, ప్రతి గడపగడపకు తీసుకుపోయి, ప్రచారం నిర్వహించాలని కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బుల్రేడ్ల కేశవరెడ్డి, జిల్లా కార్యదర్శి మాసు రజిని, పట్టణ ప్రధాన కార్యదర్శి రాచర్ల సంతోష్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు సబ్బని రాజనర్సు, సీనియర్ నాయకులు రేవెల్లి రాజలింగు, జిల్లా కార్యవర్గ సభ్యులు మోహన్, పట్టణ ఉపాధ్యక్షులు మేకల రాజశేఖర్, కాసర్ల యాదగిరి, ముడిమడుగుల శ్రీనివాస్, గాన్ల మహేష్, గోమాస కమల, కల్లేపల్లి నవీన్, ఎరుకల నర్సింగ్, దార కళ్యాణి, పీక లక్ష్మణ్ , మైనార్టీ మోర్చా పట్టణ అధ్యక్షులు ఎండీ అంజద్, నామాల చింటు, కనకం విజయ్ , బసవరాజు శ్యామ్, బి సి మోర్చా పట్టణ ఉపాధ్యక్షులు జీదుల రాములు, తదితరులు పాల్గొన్నారు
Share this on your social network: