మునుగొడులో కూసుకుంట్ల గెలుపు ఖాయం --కె.పి.వివేకానంద్ గౌడ్

Published: Tuesday October 18, 2022
చౌటుప్పల్, అక్టోబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి):
చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగడపల్లి గ్రామం లో ముటుకుల్లోజు దాయాకరచారి ఆధ్వర్యంలో కుబ్దుల్లాపూర్ శాసనసభ్యులు కె.పి.వివేకానంద్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే ఏ ఇతర రాష్ట్రంలో కూడా లేవని, దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు.2018 తర్వాత నియోజకవర్గంలో ఇలాంటి అభివృద్ధి పనులు జరగలేదని అన్నారు.దేశంలోనే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించి గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించుకుందామని తెలిపారు.
బీజేపీ నాయకులని అన్ని గ్రామాల్లో నిలదీస్తున్నారని,చైతన్యవంతులైన ఓటర్లు అభివృద్ధి వైపు నిలబడి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు. కాంగ్రెస్ నుండి బీజేపీలోకి మారిన రాజగోపాల్ రెడ్డి ఏం సాధిస్తాడో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ దూదిమెట్ల సోమేష్ యాదవ్, నాయకులు బొప్పెడు ఉపేందర్ రెడ్డి, రామచంద్ర రెడ్డి, నరేందర్ రెడ్డి, బండి వెంకటేష్, నూతి శివ, అస్లాం, గట్టు రామచంద్రం, డాకోజి రవి, కిషోర్, వెంకన్న, గుండెబోయిన వేణు, అంజయ్య, కందుల సత్తయ్య, బొల్లమోని శంకరయ్య, బొల్లమోని శ్రీను, సోమేశ్ యాదవ్, లక్ష్మారెడ్డి, రషీద్, ఏనుగుల శ్రీనివాసరెడ్డి, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area