పలు కుటుంబాలను పరామర్శించిన మల్లు నందిని

Published: Wednesday February 01, 2023

 బోనకల్, జనవరి 31 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని రావినూతల గ్రామంలో సిఎల్పి నేత మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని పలు కుటుంబాలను పరామర్శించారు.మొదటిగా ఇటీవలే అనారోగ్యానికి గురైన చేబ్రోలు మల్లికార్జునరావు, కొత్తపల్లి బాబుని పరామర్శించి, వారి యోగక్షేమాలు తెలుసుకొని, వారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారి కుటుంబానికి ఏ ఆపద వచ్చిన కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రావినూతల గ్రామ శాఖ అధ్యక్షుడు వట్టికుంట రామకృష్ణ, కలకోటసొసైటీ అధ్యక్షుడు కర్నాటి రామకోటేశ్వరరావు, మధిర ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు దార బాలరాజు, చోప్పక ట్లపాలెం సర్పంచ్ ఎర్రం శెట్టి సుబ్బారావు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు బానోత్ శ్రీను,యువజన కాంగ్రెస్ నాయకులు ఏసుపోగు హేమన్, బుడగ జంగాల మండల అధ్యక్షుడు జంగాల నాగరాజు, ఆవునూరి సత్యనారాయణ, మిరియాల నాగేశ్వరరావు, కొత్తపల్లి లాజర్, తాళ్లూరి శ్రీను, పలువురు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.