చందానగర్ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్

Published: Monday July 12, 2021
శేరిలింగంపల్లి, ప్రజాపాలన ప్రతినిధి : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని  చందానగర్ హైవేపై ఓపెన్ డ్రైన్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రణాళికా లోపం కారణంగా ప్రజల ప్రాణాలకు శాపంగా మారిందని బిజెపి రాష్ట్ర నేత కసిరెడ్డి భాస్కరరెడ్డి అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు డ్రైన్ ను పరిశీంచి, డిసి సుధాంషు దృష్టికి తీసుకు వచ్చి వెంటనే పరిష్కరించాలని కోరడం జరిగింది. ఈ సందర్భంగా కసిరెడ్డి భాస్కరరెడ్డి మాట్లాడుతూ ప్రజల ప్రాణాలతో అధికారులు చెలగాటమాడుతున్నారన్నారు. స్థానిక కార్పొరేటర్ కు, అధికారులకు ఈ విషయం తెలియదా…? లేక తెలిసికూడా అలసత్వం వహిస్తున్నారో తెలియడం లేదన్నారు. చందానగర్ హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులు దీర్ఘకాలికంగా జరుగడం, ఓపెన్ డ్రైన్ పూర్తిగా శిథిలమై పని చేయకపోవడం ప్రజలకు శాపంగా తయారై, ప్రమాదాలు జరుగుతున్నాయని ఇకనైన వెంటనే హైవేపై ఫుట్ ఓవర్ బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని, పూర్తిగా శిథిలమైన ఓపెన్ డ్రైన్ పనిచేసేలా చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.