ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి ** ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్ **
Published: Thursday August 25, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు24 (ప్రజాపాలన, ప్రతినిధి) : ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలని ఆసిఫాబాద్ డిఎస్పి శ్రీనివాస్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో పిఎస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ గణేష్ నవరాత్రి ఉత్సవాలను సోదర భావంతో కలిసి జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. వాణిజ్య సంస్థలు రాత్రి 9 గంటల లోపు మూసివేయాలని, ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలు పాటించని వారు ఎంతటివారైనా చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో సిఐ రాణా ప్రతాప్, ఎస్సైలు గంగన్న, రమేష్, అబ్దుల్ ఫయాజ్, బిజెపి నాయకులు విశాల్, అబ్దుల్ రెహమాన్, అబ్దుల్ హన్నన్, మురళి, సులేమాన్, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: