మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కెసిఆర్ కిట్టును అందజేశారు
Published: Tuesday March 08, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 7 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు తులేకలాన్ గ్రామంలో మహిళ దినోత్సవ సంబరాల్లో భాగంగా గౌరవనీయులు రంగారెడ్డి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు మహిళ దినోత్సవ సంబరాల్లో భాగంగా మండల పార్టీ అధ్యక్షుడు బుగ్గ రాములు మాట్లాడుతూ. 2వ రోజు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్ కిట్ లబ్ది దారులకు మన రాష్ట్రలో ప్రవేశపెట్టిన పథకాల గురించి గడప గడప కు తిరిగి వివరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో ఇపట్నం మండలం తెరాస పార్టీ అధ్యక్షులు చిలుకల బుగ్గరాములు, గ్రామ సర్పంచ్ యాదగిరి, ఎంపీటీసీ నాగమణి-భాస్కర్, వార్డ్ సభ్యులు మల్లారెడ్డి, లావణ్య-నరసింహ, నగేష్, మండల బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బీరప్ప, మాజీ డైరెక్టర్ వీరయ్య, సీనియర్ నాయకులు మహేందర్, రమేష్, వెంకటేష్, గ్రామ తెరాస పార్టీ అధ్యక్షులు యాదగిరి, ప్రధానకార్యదర్శి జగదీష్, యూత్ అధ్యక్షులు రవి, ఉపాధ్యక్షులు మహేష్, బీరప్ప తదితరులు పాల్గొనడం జరిగింది.
Share this on your social network: