ఆర్థికంగా బలపడి ఆదర్శంగా నిలవాలి
Published: Wednesday May 18, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 17 మే ప్రజాపాలన :
ఆర్థికంగా బలపడి ఆదర్శంగా నిలవాలని
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆకాంక్షించారు. మంగళవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ స్వగృహం ఆవరణలో *దళిత బంధు పథకం* లబ్ధిదారుడు వికారాబాద్ మండలం బురాన్ పల్లి గ్రామానికి చెందిన అనిల్ కుమార్ కు ట్రాక్టర్ ను అందజేశారు. దళితులు ఆర్థికంగా ఎదగాలనే తపనతో ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. లబ్ధిపొందినవారు సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా బలపడి ఆదర్శంగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బురాన్ పల్లి గ్రామ సర్పంచ్ భర్త సాయిక్రిష్ణ గౌడ్, మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సత్తయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: