ఐదు మల్టి నేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు సాధించిన యువతిని అభినందించిన----జగిత్యాల ఎమ్మెల్యే డా.
Published: Tuesday July 26, 2022
రాయికల్, జూలై 25 (ప్రజాపాలన ప్రతినిధి):
రాయికల్ పట్టణానికి చెందిన రుద్రరచన చిన్ననాడే తల్లిదండ్రులనీ కోల్పోయి కష్టపడి చదివి ఇ సెట్ లో మంచి ర్యాంక్ సాధించి,సి.బి.ఐ.టి లో సీటు సాధించిన రచన. తను కళాశాల,హాస్టల్ ఫీజు కట్టలేని స్థితిలో ఉన్నందువలన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.ఆర్ కు తన పరిస్థితిని ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేయగా, స్పందించిన మంత్రి కేటీఆర్ కళాశాల,హాస్టల్ ఫీజు చెల్లించి, చదువు పూర్తిఅయ్యేంతవరకు భాధ్యత తీసుకుంటానని హామీఇచ్చితనభాధ్యత ను నెరవేర్చగా, కేటీఆర్ సహకారంతో చదివి నేడు క్యాంపస్ ఇంటర్వ్యూలో 5 మల్టీ నేషనల్ కంపనీలలో ఉద్యోగం సాధించి జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మేల్యే క్వార్టర్స్ లో మర్యాద పూర్వకంగా కలవగా, రచనను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ శాలువాతో సత్కరించి, అభినందించారు.
Share this on your social network: