అగ్గి తెగులు నివారణకు చర్యలు తీసుకోవాలి

Published: Thursday February 25, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి వరిపైర్లకు వచ్చే అగ్గితెగులు నివారణకు చర్యలు తీసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారి అంజలీదేవి అన్నారు.బుధవారం మండలంలోని కంచనపల్లి గ్రామంలో అగ్గితెగులు సోకిన వరి పైరును వారు ఏరువాక కేంద్రం అధికారి నరేందర్ తో కలిసి సందర్శించి మాట్లాడుతూ వరిపైరుకు పైమందులు పిచికారీ చేసి నివారణ చర్యలు తీసుకోవడానికి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏ ఈ ఓ లు సాయి,భాగ్యలత,రైతులు తదితరులు పాల్గొన్నారు.