అంతర్జాతీయ యోగా దినోత్సవంను విజయవంతం చేయాలి మంచిర్యాల బ్యూరో, జూన్ 16, ప్రజాపాలన.

Published: Friday June 17, 2022
జూన్ 21న జరగనున్న 8వ అంతర్భాతీయ యోగా దినోత్సవమును విజయవంతం చేయాలని. జిల్లా నోడల్ అధికారి డాక్టర్ నారాయణ రావు తెలిపారు. గురువారం 
 ఆయుష్ డిపార్ట్ మెంట్,  ప్రైవేటు యోగా సంస్థల  ఆధ్వర్యంలో శోభ యాత్ర ను  నిర్వహించారు. ఇందులో భాగాంగా శోభయాత్రలో వివిధ యోగా ఆసనాలను ప్రదర్శించి చూపరులను ఆకట్టుకున్నారు . విశ్వ ఆయుర్వేద పరిషత్ మంచిర్యాల విభాగం వారు కూడా ఈ యాత్ర లో పాల్గొన్నారు. జిల్లా నోడల్ అధికారి డా|| నారాయణ రావు అధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిగించడం జరిగినది.ఈ కార్య క్రమంలో జిల్లా మాజీ నోడల్ అధికారి. డాక్టర్  జగన్మోహన్, డిప్యూటి నోడల్ అధికారులు అధికారి డాక్టర్ ప్రశాంత్, డా, పద్మజ, డాక్టర్ సంజయ్ కుమార్, ఆయుష్ ఫార్మాసిస్టులు,సిబ్బంది హాజరై ఈ కార్యక్రమమును విజయ వంతం చేశారు. ఇందులో మంచిర్యాల జిల్లా యోగా సంస్థల గురువులు శ్రీనివాస్ రెడ్డి, విజయ్ కుమార్ ఆర్య, బాలకృష్ణ,ముక్త వేణుగోపాల్,కోడూరి శ్రీనివాస్,రాజయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల బస్టాండ్ ముందు వివిధరకాల యోగా విన్యాసాలు ప్రదర్శించారు.