హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడి పూజ
Published: Thursday December 09, 2021
వికారాబాద్ బ్యూరో 08 డిసెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ అయ్యప్ప స్వామి ఆలయంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మహా పడి పూజ నిర్వహించారు. వికారాబాద్ పట్టణంలోని అయ్యప్ప ఆలయంలో భూమయ్య స్వామి ఆధ్వర్యంలో ఉదయం 9 గంటలకు అయ్యప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామికి పూలతో అలంకరించిన 18 మెట్లకు పూజలు నిర్వహించి వాటిపై దీపాలు వెలిగించి పడిపూజ నిర్వహించారు. అంతకు ముందు స్వాములు స్వామికి ఇష్టమైన పేట తుని ఆడుతూ మంత్రముగ్ధులయ్యారు. అనంతరం భోజనాలు నిర్వహించి భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో స్వాములు స్వామి ఆదిత్య స్వామి రమణ స్వామి యాదయ్య కేదార్నాథ్ వినయ్ కుమార్ గోపాల్ రెడ్డి డొకోమో రవి సుధీర్ రెడ్డి వినయ్ కేదార్ నాథ్ ప్రభు స్వామి నాగరాజు గౌడ్ నాగరాజు పవన్ కృష్ణ అశోక్ తదితర స్వాములు పాల్గొన్నారు.
Share this on your social network: