రోశయ్యకు మధిరతో అనుబంధం

Published: Monday December 06, 2021
మధిర డిసెంబర్ 5 ప్రజాపాలన ప్రతినిధి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మృతి తెలుగు రెండు రాష్ట్రాలకు తీరని లోటు. రాజకీయాల్లో నిజాయితీగా వ్యవహరిస్తూ ముక్కు సూటిగా మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు పాటించి అజాత శత్రువుగా ఖ్యాతి గడించారు. కొణిజేటి రోశయ్య మృతితో దేశం గొప్ప మేధావి కోల్పోయింది. అంతటి చరిత్ర కలిగిన రాజకీయ చాణక్యడు కొణిజేటి రోశయ్యకి మధిరతో సంబంధం ఉంది. 1993లో మధిరలో ప్రముఖ పారిశ్రామికవేత్త రంగా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్మించిన ఆర్య వైశ్య కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి రోశయ్య మధిరకు వచ్చారు. తొలిసారి మధిరకు వచ్చారు. కొణిజేటి రోశయ్య మృతితో రోశయ్య గతంలో మధిర వచ్చిన సందర్భంగా గడిపిన జ్ఞాపకాలను ఈ సందర్భంగా మధిర ప్రాంత ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.