ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం --ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్

Published: Thursday August 04, 2022

జగిత్యాల, ఆగస్ట్, 03 ( ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జగిత్యాల అర్బన్ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం యూనిట్ 2 నూతన కార్యవర్గ సభ్యులు ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ను ఎమ్మేల్యే క్వార్టర్స్ లో మర్యాదపూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలిపినారు. అనంతరం ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ను శాలువా తో సత్కరించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షనర్ లకు, ప్రభుత్వ   ఉద్యోగులకు లాభం చేకూరింది అని వారికి అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగులకు, పెన్షనర్ లకు 43 శాతం ఫిట్మెంట్, 30శాతం అదనపు పిట్ మెంట్ మంజూరు ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమంలో కరబుజ రవీందర్, కార్యదర్శి అంజయ్య, ఉపాధ్యక్షులు రామ స్వామీ, కిషన్, కోషాదికారి గంప రాములు, అసోసియేట్ అధ్యక్షులు బాల మురళి కృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజేశ్వర్ రావు, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.