మడుపల్లి గ్రామంలో ముమ్మరంగా సభ్యత్వ నమోదు ప్రజల నుంచి వస్తున్న విశేష స్పందన

Published: Tuesday February 01, 2022
మధిర జనవరి 31 ప్రజాపాలన ప్రతినిధి : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మధిర శ్యాసన సభ్యులు మల్లు భట్టివిక్రమార్క ఆదేశంతో ఈరోజు మధిర మున్సిపాలిటీ పరిధిలోని మడుపల్లి గ్రామంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మధిర మండల సభ్యత్వ నమోదు ఇన్చార్జ్ పెండ్ర అంజయ్య ఆధ్వర్యంలో బూత్ కమిటీ ఇంచార్జి మల్లవరపు అప్పారావు ద్వారా ముమ్మరంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగిందివేమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మడుపల్లి గ్రామంలో చేలో పని చేస్తున్న మహిళలు కూడా ఆనందంగా పిలిచి సభ్యత్వం తీసుకోవటం రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు ఇదే నిదర్శనం అన్నారు. లక్ష రూపాయలు రుణ మాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన trs ప్రభుత్వం ఇపుడు ఆ మాట మరిచి పోయింది అన్నారు.. మడుపల్లి గ్రామంలో చురుకుగా సభ్యత్వ నమోదు అవుతుంది అన్నారు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, మున్సిపాలిటీ కౌన్సిలర్ కోన ధనికుమార్, మధిర నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి మధిర పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, వీర స్వామి మొదలగువారు పాల్గొన్నారు.