మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే బట్టి విక్రమార్క జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ

Published: Friday February 17, 2023
ఖమ్మం లో మంత్రి పువ్వాడ అజయ్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు కి వినతి పత్రాలు అందజేసిన మధిర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు.మధిర నియోజకవర్గ కేంద్రంలో గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం వెంటనే ప్రజాప్రతినిధులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సిఎల్పీ నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు స్పందించి జర్నలిస్టుకు ఇళ్లస్థలాలు ఇవ్వాలని కోరుతూ  మధిర ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు వినతి పత్రాలు అందించారు. ఖమ్మం లోనే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను మరియు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కను జడ్పీ చైర్మన్ బిఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ లింగాల కమల్ రాజు వారి క్యాంప్ ఆఫీసులకు వెళ్లి స్వయంగా జర్నలిస్టులు వినతి పత్రాలు అందించి అర్హులైన జర్నలిస్టులకు వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మంత్రిగారు భట్టిగారు, కమల్ రాజు గారు సానుకూలంగా స్పందించారు తప్పనిసరిగా మధిర జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు వచ్చే విధంగా కృషి చేస్తామని ఆభయం ఇచ్చారు. ప్రజా ప్రతినిధులను కలిసిన వారిలో సీనియర్ జర్నలిస్టులు అట్లూరి సాంభిరెడ్డి, కొంగర మురళి, దనిశెట్టి శ్రీనివాసరావు, మక్కెన నాగేశ్వరరావు, టీవీ9 కిషోర్, మిరియాల శ్రీనివాసరావు, రామోజీ యోగేష్, పాగి బాలస్వామి, జీవి, టీవీ5 నాగరాజు, చెరుకూరి వినోద్ ఉన్నారు.