నేడు ఖమ్మంలో మహాసభలను జయప్రదం చేయాలి.. గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు..*
Published: Thursday December 29, 2022
తల్లాడ, డిసెంబర్ 28 (ప్రజా పాలన న్యూస్):
*ఈనెల 29న ఖమ్మంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడవ మహాసభను జయప్రదం చేయాలని తల్లాడ మండలంలోని గోపాలపేట గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సిపిఎం నాయకులు, గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు ఆధ్వర్యంలో గ్రామంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నల్లమోతు మోహన్ రావు మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై అనేక పోరాటాలు చేసామని తెలిపారు. ఈ ఖమ్మం మహాసభకు కేరళ ముఖ్యమంత్రి పినరాయ్ విజయన్, సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో పాటు ముఖ్య నేతలు హాజరవుతారని తెలిపారు. ఈ మహా సభకు కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ, రైతు సంఘం, సిఐటియు, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.*
Share this on your social network: