ధాన్యం కొనుగోలు చేయడం లో తెరాస, బిజెపి ప్రభుత్వాలు విఫలం
Published: Thursday November 25, 2021
ఇబ్రహీంపట్నం అక్టోబర్ 24 ప్రజాపాలన ప్రతినిధి : రైతులు పండించిన వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేయాలనీ కోరుతూ, రైతులను మోసం చేస్తున్న తెరాస, బిజెపి ప్రభుత్వాల మొండి వైఖరి నశించాలని కోరుతూ .కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు బుధవారం రోజున మాజీ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అద్వర్యంలో అబ్దుల్లాపూర్ మెట్ మండల పరిధి లోని గౌరెల్లి, బండరావిరాల రైతుల కల్లాలను సందర్శించి అనంతరం స్ధానిక తహశీల్ధార్ కి వినతిపత్రం అందచేయడం జరిగింది.. రైతులను ఆదుకోకపోతే సీఎం క్యాంపు కార్యాలయం ప్రగతిభవన్ ని రైతుల ధాన్యంతో ముట్టడిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు ,సీనియర్ నాయకులు చిలుక మధుసూదన్ రెడ్డి, పాల్గొన్నారు.
Share this on your social network: