తిరుమలకు భక్తుల పాదయాత్ర

Published: Wednesday April 13, 2022
పాలేరు ఏప్రిల్ 12 ప్రజాపాలన ప్రతినిధి : నేలకొండపల్లి మండల పరిధిలోని ఆరెగూడెం గ్రామం నుంచి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు మంగళవారం పాదయాత్రగా తిరుమలకు భయలుదేరారు. పాడిపంటలు సమృద్ధిగా పండి తమ ఊరి ప్రజలు, రైతులు సుఖశాంతులతో బాగుండాలనే సంకల్పంతో ఈ పాదయాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇంగువ రామకృష్ణ పూజారి నేతృత్వంలో యాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రను సర్పంచ్ దొనకొండ రామకృష్ణ, డిసిఎంస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, ఎంపిటిసి రేగూరి వాసవీ ప్రారంభించారు. తొలుత గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. 30 మంది భక్తులతో పాదయాత్ర ఈ నెల 27 తిరుమలకు చేరుకుంటుందని అన్నారు, ఈ పాదయాత్రలో పాల్గొని సంఘీభావం ప్రకటించారు.ఈ కార్యక్రమంలో పూజారి దివాకర్, రేగురి హనుమంతరావు, కొత్తా రమేష్, కొత్తా జనార్దన్ రావు, దోసపాటి శేఖర్, ఈగా అనిల్, తెల్లకుల జయశ్రీ, డివిఎల్ తో పాటు అరెగూడెం గ్రామా పెద్దలు పలువురు భక్తులు పాల్గొన్నారు.