మానవతా దృక్పథంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి 15 ఆక్సిజన్ సిలిండర్లు అందజేత
Published: Saturday May 08, 2021
జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అజయ్
పరిగి, మే 7, ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా, పరిగి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడటం వలన ఆస్పత్రి సిబ్బంది, జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి దృష్టికి తీసుకో వెళ్లడంతో మానవతాదృక్పథంతో పరిగి జడ్పిటిసి హరిప్రియ ప్రవీణ్ కుమార్ రెడ్డి, అజయ్ సొంత ఖర్చులతో 15 ఆక్సిజన్ సిలిండర్లను పరిగి ఆసుపత్రికి ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ కుమార్ ఎంపీపీ కరణం అరవింద్ రావు, తెరాస సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, సురేందర్ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు అశోక్ వర్ధన్ రెడ్డి పి ఏ సి ఎస్ వైస్ చైర్మన్ భాస్కర్, రాఘవపూర్ సర్పంచ్ జగన్, బలాల, ఆసుపత్రి సూపర్డెంట్, డాక్టర్ ప్రవీణ్, జూనియర్ అసిస్టెంట్ వెంకటేష్ పాల్గొన్నారు.
Share this on your social network: