బాబాసాహెబ్ అంబేద్కర్ పై హమారా ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ర్యాలీ, దిష్టి బొమ్మ ద
Published: Friday February 17, 2023
కోరుట్ల, ఫిబ్రవరి 16 ( ప్రజాపాలన ప్రతినిధి):
బాబాసాహెబ్ అంబేద్కర్ పై హమారా ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కోరుట్ల మండలం జోగన్ పల్లి గ్రామంలో అంబేడ్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో గురువారం రోజున నిరసన తెలిపి , హమారా ప్రసాద్ దిష్టి బొమ్మ ను ఊరేగింపు చేసి దహనం చేశారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ యువజన సంఘల నాయకులు మాట్లాడుతూ హమారా ప్రసాద్ అనే వ్యక్తి విద్వేష పూరిత మాటలు, మరియు బాబాసాహెబ్ అంబేద్కర్ ని హత్య చేసే వాడిని అని చెప్పే అహంకారం పూరిత ధోరణి నశించాలని భారత దేశ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం తన సరస్వం త్యాగం చేసిన మహానుభావుడు బాబాసాహెబ్, అయన ఆశయలను అనుగుణంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని హామర ప్రసాద్ ను వెంటనే ప్రభుత్వం కఠిన శిక్ష విధించాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు డిమాండ్ చేశారు.
Share this on your social network: