బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు యాదవ్ జన్మదిన వేడుకలు

Published: Wednesday May 05, 2021
బాలపూర్ (ప్రతినిధి) ప్రజాపాలన న్యూస్ : సంతోషకరమైన వేడుకలు నలుగురికి పంచాలని దృక్పథం కలిగిన బిజెపి నేత మహేశ్వరం నియోజకవర్గం ఇన్చార్జి కార్యవర్గ సభ్యులు అందెల జన్మదిన వేడుకలను పలువురు నేతలు కలిసి అనాధ ఆశ్రమంలో ఘనంగా నిర్వహించారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నాదర్గుల్ గ్రామం సమీపంలో ఉన్నటువంటి మాతృదేవోభవ అనాధ ఆశ్రమం అభాగ్యుల మధ్య బిజెపి నేతలు పలువురు కలిసి మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి శ్రీ రాములు యాదవ్ జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ. అందెల శ్రీరాములు యాదవ్ బి.జె.పి మహేశ్వరం నియోజకవర్గ ఇంఛార్జీ,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గారికి మాతృదేవోభవ అనాధ ఆశ్రమం తరపున హృదయపూర్వక ఈ సంతోషకరమైన వేడుకలు నలుగురికి పంచాలని సంకల్పంతో పుట్టినరోజు వేడుకలను అనాధ అభాగ్యుల మధ్య జరిపించారు. ఆశ్రమ వాసులందరికీ విశేష అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కార్యకర్తలు మాట్లాడుతూ.... అందెల శ్రీరాములు యాదవ్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతున్ని ఆశీస్సులతో జీవితం నిత్యం ఆనందంగా,ఆరోగ్యంగా సుఖ,సంతోషాలతో ఉండాలని, భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలని మనసారా ఆశ్రమం తరుపున మనస్పూర్తిగా కోరుకుంటున్నామునీ. అభాగ్యులకు సహాయ, సహకారములు అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు చెరుకుపల్లి వెంకటరెడ్డి, కార్పొరేషన్ కార్పొరేటర్లు నిమ్మల సునీత శ్రీకాంత్ గౌడ్, తోట శ్రీధర్ రెడ్డి, రామోజీ అమితా శ్రీశైలం చారి, ప్రభు బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.