సహకార సంఘాలను బలోపేతం చేయాలి

Published: Tuesday February 01, 2022
ఆసిఫాబాద్ జిల్లా జనవరి 31 (ప్రజాపాలన ప్రతినిధి) : జిల్లా లోని ప్రాథమిక సహకార సంఘాలలో మరింత బలోపేతం చేసేలా కృషి చేయాలనే జడ్పిటిసి, అరిగెల నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని ప్రాథమిక సహాయ సహకార సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని, ముందుగా ఇటీవల నూతనంగా సహకార సంఘం "జిల్లా అధ్యక్షుడిగా ఎంపికైన అలీ బిన్ అహ్మద్" అందరిని కలుపు కుంటూ అంచె లంచెలుగా ఎదుగుతూ ఒక ఉన్నత స్థానంలో నిలిచారని కొనియాడారు. ప్రతి ఒక్కరిని సమన్యాయం చేసుకుంటూ మరిన్ని ఉన్నత పదవులను చేపట్టాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రాథమిక సంఘాల అభివృద్ధి చేసి మంచి గుర్తింపు తీసుకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. నాపై నమ్మకంతో ఉంచిన బాధ్యతను నా వంతుగా నెరవేర్చేందుకు కృషి చేస్తానని, తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం వైస్ చైర్మన్ ప్రహ్లాద్, కో ఆప్షన్ సభ్యుడు అమన్,,పాలకవర్గం డైరెక్టర్లు దేవన్న, రాము, మురళి, మైనార్టీ నాయకులు అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.