ఆపదలో వున్న నిరుపేద విద్యార్థులుకు సహాయం

Published: Monday August 08, 2022

మధిరఆగస్టు 7 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం నాడు  పట్టణ అజాద్ రోడ్డు లో ప్రముఖ సామాజిక సేవకుడు లంకా సేవ ఫౌండేషన్ వ్యస్థాపక అధ్యక్షులు లంకా కొండయ్య ఆధ్వర్యంలో మానవ సేవ మాధవ సేవ గా భావించి  మండల రాయపట్నం గ్రామం సాతులూరి సురేఖ ఇంటర్ పాస్ ఐ తండ్రి లేని విద్యార్ని కీ అదే విధంగా తల్లాడ మండలం మిట్టపల్లి గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థి రక్త హీనత తో బాధపడుతున్నజీనుగు కీర్తి తల్లి అనారోగ్యం తో బాధ పడుతుంది  ఈ రెండు కుటుంబాల దీన పరిస్థితి కొండయ్య ఒక దాత కు వివరించగ, ఆ దాత ఐన ప్రముఖ వ్యాపారి మధిర పట్టణ ఆర్య వైశ్య ప్రముఖులు  శ్రీ వేముల ఆంజనేయలు మానవతా దృక్పధం తో స్పందించి రెండు కుటుంబాలకు ఒక నెలకు సరిపడా కిరాణా సరుకులు, బియ్యం ఆదివారం లంకా కొండయ్య గృహం వద్ద ఈ కుటుంబాలకు వితరణ చేయడం జరిగినది. ఈ సందర్బంగా కొండయ్య మాట్లాడుతూ సమాజం లో దీన పరిస్థితి లో వున్నా కొన్ని కుటుంబాలకు, ధనవంతులు లేని వారికి మానవత దృక్పధం తో వితరణ చేయుటకు ముందుకు రావాలని తెలియపరుస్తూ దాత ఐన వేముల ఆంజనేయలు గారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు కొండయ్య తెలిపారు. ఈ కార్యక్రమం లో లంకా సేవ ఫౌండేషన్ వాలంటీర్స్ పాల్గొన్నారు