షార్ట్ సర్క్యూట్తో పూరిల్లు దగ్ధం ఆదుకున్న అశ్వాపురం మండల కాంగ్రెస్ నాయకులు. అశ్వాపురం (ప్ర
షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు కాలిపోయిన కుటుంబాన్ని ఓదార్చిన కాంగ్రెస్ నాయకులు . అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో గుంజల కృష్ణ పూరి ఇల్లు షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఇంట్లో ఉన్నటువంటి మూడు లక్షల రూపాయలు నగదు బియ్యం, బట్టలు, వంట సామాగ్రి మంచాలు ఇంట్లో ఉన్నటువంటి సర్వం మంటల్లో కాలిపోయి కట్టు బట్టలతో ఉన్నటువంటి మిగిలినటువంటి గుంజాల కృష్ణ కుటుంబాన్ని ఓదార్చి వారి కుటుంబానికి 50 కేజీల బియ్యం పదివేల రూపాయలు నగదును అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఓరుగంటి బిక్షమయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదే కేశవరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు బట్ట విజయ గాంధీ నియోజకవర్గ కోఆర్డినేటర్ కాటబోయిన నాగేశ్వరావు ఎంపీటీసీ బేతం రామకృష్ణ బీసీ సెల్ అధ్యక్షులు బచ్చు వెంకటరమణ మండల కాంగ్రెస్ నాయకులు తూము వీర రాఘవులు మానాది సైదులు మొగిళ్ళ వెంకటరెడ్డి చెంచల రాము ఆటో నరసింహారావు గుర్రం చెన్నయ్య నారాయణ సామ సందీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: