ఘనంగా శ్రావణ మాసం మహాలక్ష్మీ ఫూజలు
Published: Monday August 29, 2022
జన్నారం, ఆగస్టు 28, ప్రజాపాలన:
శ్రావణ మాసం ముంగింపు సందర్భంగా మండల కేంద్రంలోని మహాలక్ష్మి అలయంలో ఆదివారం ఘనంగా అమ్మవారి కి పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ సభ్యులు మహాలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పురోహితులు గుండి మోహన్ శర్మ, సత్తయ్య, గణేష్ లను శాలువా కప్పి సన్మానించారు. సువిశాలమైన అలయ ప్రాంగణంలో అలయ కమిటీ ఆద్వర్యంలో, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జక్కు సత్తయ్య, గుండ సుధాకర్, గుండ లచ్చన్న, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: